చంద్రబాబు ఆరోపణలు, కుట్రలు అనవసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ కృష్ణా నదికి ఈస్థాయి వరద పదేళ్ల క్రితం వచ్చిందన్నారు. రాజకీయంగా బాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందన్నారు. నదీ ప్రవాహంలో ఉండొద్దని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పామని, మొండితనంతో చంద్రబాబు అక్కడే ఉంటున్నారని విమర్శించారు. తక్షణమే చంద్రబాబు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదన్నారు. తప్పు సరిదిద్దుకోకపోతే ప్రకృతి కోపానికి బలైపోతారని హెచ్చరించారు.