వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో బావిలో పడ్డ జింకను అటవీశాఖ అధికారులు రక్షించారు. గ్రామంలోని ఓ బావిలో జింక పడింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బావిలోకి దిగి జింకను కాపాడారు. అధికారులు జింకను రక్షించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.