కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు అనిల్కుమార్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతం కృష్ణలంక రక్షణ గోడవద్ద వరద పరిస్థితిని సమీక్షించారు. అక్కడి తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.