మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను తిప్పడం, అనుమతిలేని వ్యక్తులతో డ్రోన్లతో ఇంటి ఆవరణను షూట్ చేయడం, టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య ఘర్షణపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొంతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, నీళ్లు నింపు ఒకేసారి చంద్రబాబు ఇంటి మీదకి నీళ్లు వదిలారని చెబుతున్నారని, వరద గురించి మంత్రులకేమీ తెలియడం లేదని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని.. కరకట్టపై ఇల్లు కట్టి వరద నీళ్లు వదలొద్దని టీడీపీ నేతలు చెప్పదలచుకున్నారా అని ప్రశ్నించారు. జలాశయాలు నిండి ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని టీడీపీ నేతలకు పట్టడం లేదని, వరదలొచ్చాయని టీడీపీ నేతలకు బాధగా ఉందన్నారు.