ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 12:11 PM

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఓ వ్యక్తి తన నలుగురు కుటుంబ సభ్యులను కాల్చిచంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక నష్టాలు, అప్పుల భారమే ఈ కుటుంబాన్ని బలిగొన్నట్టు చామరాజనగర్ పోలీసులు భావిస్తున్నారు. ఓంకార్ ప్రసాద్ (33) మృతదేహం వద్దే తుపాకి ఉండడంతో… అతడే తన తల్లిదండ్రులు నాగరాజ్ భట్టాచార్య (60), హేమలత (54), భార్య నికిత (27), కుమారుడు ఆర్య కృష్ణ (5) కాల్చిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులను కాల్చిచంపిన తర్వాత అతడు కూడా అదే గన్నుతో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక మిస్టరీని ఛేదించేందుకు ఇప్పటికే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చామరాజనగర్ ఎస్పీ హెచ్‌డీ అనందకుమార్ పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com