భారతదేశంలోకి గుజరాత్ సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు గుజరాత్ పోలీసులను హెచ్చరించాయి. కచ్ ప్రాంతంలోని భారత-పాకిస్తాన్ సరిహద్దు ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిచాయి. దీనితో సముద్ర, సరిహద్దు పోలీసు సిబ్బందని అప్రమత్తం చేసి నిఘాను పెంచారు. ఈ ప్రాంతంలోని గ్రామీణులను, మత్స్యకారులను ముప్పు గురించి హెచ్చరించామని తూర్పు కచ్ ఎస్.పి. పరీక్షిత రాథోడ్ చెప్పారు.