అమరావతి: ఏపీ శాసనసభ ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. అసెంబ్లిd స్పీకర్ తమ్మినేని సీతారాం వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే శాసన మండలి వద్ద కూడా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండలి వద్ద జెండా ఎగురవేశారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.