కడప జిల్లాలోరి పెండ్లిమర్రిలో పిట్టపెంట కోసం గుహలోకి వెళ్లి ఊపిరాడక ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండలం పెడ్డదాసరిపల్లె పెద్ద చెరువు వద్ద ఉన్న బడబండ గుహలో పిట్ట పెంట కోసం, పెండ్లిమర్రి పంచాయతీ యాదవపురం గ్రామానికి చెందిన ఎస్టి యానాదులు మల్లమ్మ (50), ఆమె కుమారుడు లక్ష్మయ్య (22) లు వెళ్లి ఊపిరాడక మృతి చెందారు. సబ్ ఇన్స్పెక్టర్ ల ఆధ్వర్యంలో పెండ్లిమర్రి మండల తహశీల్దారు గుహలో ఉన్న ఒక శవాన్ని గుహ నుండి బైటకు తెచ్చారు. మరో శవాన్ని బయటికి తీయడానికి జాతీయ విపత్తుల శాఖ నుండి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ బలగాలను తహశీల్దారు తెప్పించారు.