ఏపీలో రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చివరి తేదీ కాగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు ఉదయం నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల కోసం నోటిఫికేషన్ దాఖలు చేయగా సంఖ్యాబలంతో మూడు స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు స్థానాల కోసం మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఐపీఎస్ ఇక్బల్, చల్లరామకృష్ణరెడ్డిలను అభ్యర్థులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.