ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 05:13 PM

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని కొడ్గవ్ జిల్లాలోని బాగమందల సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. మృతులను యశ్వంత్, బాలకృష్ణ, ఉదయ, యమునగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. ఇల్లు కూలిన ప్రాంతానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో బాగమందలలో 400 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా కేరళలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 44 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com