నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అందువల్ల రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి దూరంగా వాయుగుండం విస్తరించి ఉందని.. దీని కారణంగా కోస్తాతీరంలో గంటకు 45-50 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని కాబట్టి.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.