భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. 29.2 మిలియన్ డాలర్లతో సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో నిలవగా, 5.5 మిలియన్ డాలర్లతో పీవీ సింధు 13వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది.