ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వుబ్యాంక్ తన మూడో ద్వైమాసిక సమీక్షను బుధవారం ప్రకటించబోతున్నది. ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ఈ సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులు కలిగిన ఎంపీసీ బుధవారం సమావేశమై వడ్డీరేట్లకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించనున్నది.