పంచాయతీ ఎన్నికల కోసం ఈసీ రూపొందించిన ఓటర్ల జాబితా, కులప్రాతిపదికన ఓట్ల గణనలో జరిగిన లోపాలను సరిదిద్దాలంటూ సిపిఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శ నతో వినూత్న నిరసన చేపట్టారు మంగళవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట తహశీల్ధార్ కార్యాలయం ఎదుటజరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే బి.కొత్తకోట మండలంలోని అన్ని పంచాయతీల్లో కుల గణన తోపాటు ఓటర్ల జాబితాను రూపొందించారు. వారు రూపొందించిన ఓటర్ల జాబితాను తహశీల్ధార్ కార్యా లయం నోటీస్ బోర్డు నందు ఉంచారు. ఎవైనా తప్పులు దొర్లి ఉంటే సరిచూసుకోవాలని ప్రజలకు వారు సూచించారు. అయితే కొన్నివార్డులను నిశితంగా పరిశీలించిన లోపాలను కనుగొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కులఓటర్ల గణనతోపాటు ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదే శాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా పంచాయతీల్లో పర్యటించి కులగణన ప్రకారం ఓటర్ల జాబితా రూపొందించాల్సిన అధికారులు ఆఫీసులో కూర్చొని తయారు చేయడమేమిటని వారు ప్రశ్నించారు. కొన్ని వార్డుల్లో ఓసీ ఓటర్లు ఇద్దరు ఉంటే 14 మంది ఉన్నట్లు, బీసీ ఓటర్లు 22 మంది ఉంటే 10 మంది ఉన్నట్లు,మరికొన్ని చోట్ల ఒక్క ఓటరు లేకున్నా 11 మంది ఉన్నట్లు, ఇంకో చోట 23 మంది బీసీ ఓటర్లు ఉంటే 12 మంది ఉన్నట్లుగా రూపొందించారన్నారు. . కులగణన ఓటర్ల జాబితాను వెంటనే సవరించాలని లేని యెడల ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.