ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని, ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు knruhs.in, knruhs.telangana.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.