ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి నీటి ప్రవాహం అధికం కావడంతో ఆదివారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు తాజాగా దానిని ఉపసంహరించుకున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 13.70 అడుగులుగా ఉంది.సముద్రంలోకి 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఫ్లడ్ కన్జవేటర్ మోహన్రావు తెలిపారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక మరికొంత సమయం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.