క్షిపణి పరిజ్నానంలో ఇతర దేశాలకు ధీటుగా అభివృద్ది సాధిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ డైనమిక్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ జీడీఎల్ ప్రాంగణంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ… ఆకాశ్, అగ్ని, నాగ్, త్రిశూల్ వంటి పేర్లు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. ఎంత ఆధునికంగా ఉన్నప్పటికీ సంయమనంతో కూడిన సైనిక వ్యవస్థ మనదని అన్నారు.