ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిని వేధించారని ముగ్గురిని చితకబాదిన వైనం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2019, 04:41 PM

ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో ఓ యువతిని వేధించినందుకు ముగ్గురు యువకులను చితకబాధిన ఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని వేధించారంటూ యువతి బంధువులైన ఆరుగురు యువకులు కలిసి ముగ్గురు యువకులను శివారులో ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద ఓ యువతిని ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆ యువతి కుటుంబసభ్యులకు చెప్పింది. బంధువులు, కుటుంబసభ్యులు కలిసి ఆ ముగ్గురు యువకులను జామాయిల్ తోటలోకి తీసుకువెళ్లి చితకబాదారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్నా కనికరం చూపకుండా చితకబాదారని ఆ ముగ్గురు యువకులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com