ఏలూరు లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఏఎన్ఎంలు ముట్టడించి ధర్నా నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ ఎన్ ఎమ్ పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం, యూరోపియన్ ఏఎన్ఎం, 104 ఏఎన్ఎం లతో భర్తీ చేయాలని, మిగిలిన పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని, రెండవ ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా లో వందలాది ఏఎన్ఎంలు పాల్గొన్నారు.