పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో ఈ ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగో జిల్లా వ్యాప్తంగా వేకువజామున నాలుగు గంటల నుండే జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో మొదలైన వర్షాలు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలలో ఆనందం మొదలు కాగా లోతట్టు ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక తూగో జిల్లాలో తుని, అన్నవరం ప్రాంతాలలో జోరు వానలు కురుస్తుండగా పంపా జలాశయంలోకి ప్రవాహం పెరుగుతుంది. జిల్లా వ్యాప్తం జలకళ సంతరించుకోవడంతో అన్నదాతలు ఆనందంలో ఉన్నారు.