రైతుని ఆదుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు నిధులు అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. మంగళవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బదులిస్తూ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోందని అందువల్ల ఏపీలో రైతు భరోసా పేరుతోనూ, తెలంగాణలో రైతుబంధు పేరుతోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు కేంద్రం ఆర్థిక సహాయం ఉండదని, ఈ పథకాలకు కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.