ఆంధ్రప్రదేశ్ రాజదాని పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ బ్యాంకు నిర్ణయం తర్వాత అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు మరో బ్యాంకు ప్రకటించింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్స్ బ్యాంకు (ఏఐఐబీ) తేల్చిచెప్పింది. అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖుత చూపింది.