ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోంది. గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్లో చేరిన మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కమలం గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయన తమ పార్టీని వీడరంటూ హస్తం నేతలు ఎంత చెపుతున్నా నల్లారి మాత్రం తన పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలపై కనీసం మాట్లాడటం లేదు.
కాగా బిజెపి- కాంగ్రెస్లు ఏపిని సమైక్యంగా విడగొట్టాయంటూ విభజన నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి, డిపాజిట్లు కూడా దక్కక ని నల్లారి తిరిగి ఇటీవల ఎన్నికల ముందు హస్తం గూటికే చేరుకున్నారు. ఆయన ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడ లేదు సరికదా కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయారు. దీనికి తోడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరటం ఊకడా ఆతనికి పెద్ద మైనస్. ఇద్దరూ చెరో పార్టీలో ఉంటంతో వారి ఇద్దరిమధ్య బాగా గ్యాప్ పెరిగిపోయిందని, అటు కాంగ్రెస్, ఇటు టీడీపీల భవితవ్యం రాను రానూ దిగజారుతున్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ బీజేపీలో చేరితే వారి రాజకీయ భవిష్యత్ బావుంటుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఏం జరగనుందో చూడాలి.