అసెంబ్లీ సమావేశాల్లో నేడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య 45 ఏళ్లకి పెన్షన్పై తీవ్ర మాటల యుద్ధం సాగిన నేపథ్యంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్పై తనదైన శైలిలలో మరోమారు ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. 45 ఏళ్ల రత్నం అయిన పెన్షన్ మాయం అయింది. ‘46 ఏళ్లకి జగన్ గారికి ఉద్యోగం వచ్చింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు.. కుర్చీ ఎక్కిన వెంటనే జగన్ మర్చిపోయారా?’’ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేశారు" అంటూ జగన్పై ట్వీట్ చేశారు.
జగన్ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు అందాల్సిఉందని, కానీ జగన్ మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోందని ట్విట్టర్లో లోకేష్ చెప్పుకొచ్చారు