నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించేందుకు తీసుకుని వచ్చిన బిల్లు, మహిళా సాధికారత కోసం మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లులకు ప్రభుత్వం చట్టం చేసింది. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లుకు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చరిత్రాత్మక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. సామాజిక విప్లవానికి నాందిగా రాష్ట్రంలోని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే తలంపే ఈ కీలకమైన బి ల్లుల రూపకల్పనకు శ్రీకారం చుట్టేలా చేసిందని ప్రభుత్వం చెపుతోంది. ఈ బిల్లు ప్రకారం అన్నీ కార్పొరేషన్లు, సొసైటీ పదవుల్లో, బోర్డులు, కమిటీల చైర్మన్ పదవుల్లో మహిళలకు సగం పదవులు దక్కడం ఖాయం . అలాగే రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కలుగుతాయి.. వర్క్, సర్వీస్ కాంట్రాక్టుల్లో నూ 50శాతం రిజర్వేషన్లు అందుతాయి.