ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేతను కలసి పార్టీని వీడే అంశంపై చర్చించిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజాగా పార్టీ మారే అంశంపై స్పందించారు. మంగళవారం వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాలో మాట్లాడుతున్న సమయంలో బీజేపీలో చేరుతున్నారా? అని ప్రశ్నించిన పాత్రికేయునికి సమాధానమిస్తూ, నాకున్న ఒత్తిళ్లు నాకున్నాయి, చూద్దాం, మారే అవకాశాలున్నాయి. ఇంకా టైం ఉంది. బీజేపీ వాళ్లతో నేనే మాట్లాడలేదు. రాంమాధవ్ మాత్రమే వచ్చి కలిసారు. త్వరలో అందరితో మాట్లాడతాను అంటూ బదులిచ్చారు. కాగా బిజెపిలో తన చేరిక విషయం తెలియదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
తిరుమలలో కొత్త అధ్యక్ష మందివచ్చాక వీఐపీ బ్రేక్ను బానే కంట్రోల్ చేశారని, హారతులు ఇవ్వకపోవటం అన్యాయమని అన్నారు. కనీసం ప్రొటోకాల్ వీఐపీలకైనా హారతి ఇవ్వాలని సూచించారు.