శాసనమండలిలో ఏ అంశంపైనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ…. రాజాధాని నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. తన ఆరోపణలు నిరూపించకపోతే దేనికైనా సిద్దమన్నారు. 25శాతం లోపు ఉన్న పనులపై పరిశీలనకు ఉన్నత స్థాయి కమిటీ వేశామన్నారు. రాజధాని నిర్మాణానికి టెండర్ ప్రక్రియలో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. నిపుణుల కమిటీ రాగానే రాజధానిలో ఎంత అవినీతి జరిగిందో తెలిసిపోతుందన్నారు. అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణానికి స్వ్కేర్ ఫీట్ కు రూ.10వేలు ఇచ్చారన్నారు.