ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చిత్తూరు జిల్లా రేణిగుంటకు చేరుకున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ హరిచందన్ రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్కుమార్లు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు పయనమయ్యారు. మరికాసేపట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గవర్నర్ దర్శించుకోనున్నారు.