హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టులో భూటాన్కు వెళ్లనున్నారు. పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో మోదీ విదేశీ పర్యటన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మోదీ కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవలే విదేశాంగ మంత్రి జైశంకర్ భూటాన్కు వెళ్లారు. ఆ దేశ ప్రధాని లోటే త్సరింగ్ను ఆయన కలిశారు.