కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో తన బల పరీక్ష వాయిదా పడేలా చూసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బలపరీక్ష వాయిదా వేయాలంటూ కుమారస్వామి చేసిన అభ్యర్థనను స్పీకర్ రమేశ్ కుమార్ తిరస్కరించారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే హక్కుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ బలపరీక్ష వాయిదా వేయాలని కుమారస్వామి అభ్యర్థించారు.