శ్రీహరికోటలో ఇవాళ చంద్రయాన్-2 ప్రయోగం కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.43 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 20 గంటల పాటు కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. ఈ నెల 15న నిర్వహించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్లోని క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం ఏర్పడడంతో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం సరిచేసి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.