గత ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమమావేశాల్లో విద్యుత్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని అమ్మేసి విద్యుత్ ఒప్పందాలు చేశారన్నారు. మందుగా ఈ చర్చలో చంద్రబాబు మాట్లాడాలని కోరుతున్నట్లు తెలిపారు.