చంద్రబాబు చేతికానితనం వల్ల రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల పాలైందని వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు రూ.3వేల కోట్లు నష్టపోయామన్నారు. 9శాతం పవర్ అవసరం ఉండగా, 22.6 శాతం పవర్ కొనుగోలు చేశారన్నారు. ఇది ప్రజల సొమ్ము కాదా ? దీనికి ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ పీపీఏలపై సమీక్ష జరపాల్సిన అవసరముందన్నారు. ఈ స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు.