కుమారస్వామి ఎన్ని ఎత్తులు వేసిన విశ్వాస పరీక్షలో పరాజయం పాలు కావడం ఖాయమని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కొద్దిసేపటి ముందు విలేకరులతో మాట్లాడిన ఆయన కుమారస్వామి సభలో ఈ రోజు వీడ్కోలు ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. కుమార స్వామి విశ్వాస పరీక్షలో పరాజయం అయిన తరువాత తమ కార్యాచరణ ఏమిటన్నది వెల్లడిస్తామని యెడ్యూరప్ప చెప్పారు