కర్నాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వ భవితవ్యం నేడు తేలిపోయే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షపై ఈ రోజు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా నిన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడిన కర్నాటక అసెంబ్లీ ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కుమారస్వామి సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.