కర్నాటక అసెంబ్లీ లో విశ్వాస పరీక్షపై వరుసగా రెండో రోజూ చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ పక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నంలోగా విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ స్పీకర్ ను ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలా ఉండగా స్పీకర్ కు గవర్నర్ లేఖపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు కర్నాటక డిప్యూటీ సీఎం తెలిపారు.