15రోజుల్లోనే టీడీపీ చేసిన స్కామ్ లన్నీ బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… పోలవరాన్ని స్కామ్ లతో కూడిన ప్రాజెక్టుగా టీడీపీ చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై మా ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసిందన్నారు. స్కామ్ లన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. చంద్రబాబు సభను స్వార్థం కోసం వాడుకుంటున్నారన్నారు.