ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదనీరు రావడంతో పోలవరం పనులు ఆగాయి : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2019, 10:18 AM

వరదనీరు రావడంతోనే పోలవరం ప్రాజెక్టు పనులు ఆగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయన్నారు. నవంబర్ కల్లా పనులు మొదలు పెట్టాలన్నారు. నవంబర్ లో పోలవరం పనులు ప్రారంభించి 2021 జూన్ కు నీళ్లిస్తామని చెప్పారు. మొదటిసారిగా పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు పిలుస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ లో 15నుంచి 20శాతం డబ్బు మిగులుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందన్నారు. నామినేషన్ పద్దతిలో ఇష్టానుసారంగా పనులు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే పనులు కాకుండా కాపర్ డ్యాం పనులు చేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com