అసలే తమకు వచ్చే కమిసన్లు అంతంత మాత్రమే కావటంతో జీవితాలు దుర్లభమైపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా రేషన్ డీలర్ల వ్యవస్ధనే రద్దు చేయడమేంటని రాష్ట్ర వ్యాప్తంగాఉన్న రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆంధ్ర ప్రదేశ్ చౌకధరల దుకాణం దారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మండాది వెంకటరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు అయితే తమ భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. తమని తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, అయితే రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తే తాము. మరో ఉద్యోగం చూసుకో లేని పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.
డీలర్ల వ్యవస్ధలోకి వాలంటీర్లు వచ్చి చేరుతారంటూ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారని, ఈ విషయంలో మీడియా సంస్థలలో రకరకాల కథనాలు వస్తుండటంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయన్న టెన్షన్ తట్టుకోలేక చాలా మంది డీలర్లు అనారోగ్యం పాలవుతున్నారని, తమ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసారు వెంకటరావు.