అసెంబ్లీ ఫలితాల అనంతరం సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పెడుతోన్న పోస్టులు చర్చకు దారితీస్తున్నాయి. బుద్దా వెంకన్న నానిపై ట్వీట్ల యుద్దం ఆరంభించినా చంద్రబాబు సూచనలతో ఆపేసారు. అయినా వెరవని నాని తన సామాజిక మీడియా వేదికగా అందరినీ ఉతికి ఆరేస్తున్నారు. అయితే కొంత కాలంగా ఆయన కమలం వైపు వెళ్తున్నారన్న వార్తలపైనా బాబు నాలాంటి నేతలు వద్దని చెపితే వెళ్లిపోతానంటూ లైన్ క్లియర్ చేసుకునే యత్నం చేసారు. వాస్తవానికి నాని బిజెపి నేతలతో, ముఖ్యంగా ఇటీవల పార్టీ నుంచి వెళి్లపోయిన నలుగు ఎంపీలతో టచ్లో ఉన్నవిషయాన్ని కూడా ఆయనే అంగీకరించారు.
అయితే నాని చేస్తున్న ట్వీట్ల యుద్దంపై వైసిపి నుంచి ఇప్పటికే విజయసాయిరెడ్డి తనదైన కౌంటర్లు ఇవ్వగా తాజాగా కేసీనేని పార్టీ మార్పుపై ఆయన మీద పోటీచేసి ఓడిపోయిన నిర్మత పివిపి తనదైన తీరులో కౌంటర్ ట్వీట్లు చేయటం ఆరంభించారు. “ముందు నీది పసుపు నిక్కరో.. ఖాకీ నిక్కరో తేల్చుకోవయ్యా సామి! సక్రమ సంబంధమో లేక అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారు. అటు ఇటు కానోళ్లని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెబుతారు. బై ద వే.. ప్రతిసారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా.. మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమాయే! అసలే కరువు కాలం..” అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇవ్వటంతో కేసినేని ఇకనైనా మౌనంగా ఉంటారా? లేకా మరిన్ని వేయించుకుంటారో చూడాలి.