ఏపీ శాసన మండలి గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడింది. శాసన మండలిలో మరోసారి గందరగోళం చోటు చేసుకుంది. సీఎంలా తనపై ఎలాంటి కేసులు లేవని ఎమ్మెల్సీ లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. 26 కేసులపై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని బొత్స విమర్శించారు. మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మండలిలో లోకేశ్ డిమాండ్ చేశారు. లోకేశ్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. గందరగోళం మధ్య మండలి ఛైర్మన్ శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు.