బెంగళూరు : విశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన కుమార స్వామి తన ప్రసంగంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. గతంలో కూడా ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చివేశారని ఆయనీ సందర్భంగా చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నారనీ, ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో దేశం మొత్తానికీ తెలుసుననీ అన్నారు.