ఇండియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తొలి స్థానాన్ని కొనసాగించారు. ఆయన సంపద మొత్తం 51.8 బిలియన్ డాలర్లుకాగా, ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో అంబానీ ఉన్నారు. అంబానీ తరువాతి స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ 20.5 బిలియన్ డాలర్లతో భారత కుబేరుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అజీమ్ ప్రేమ్ జీది 48వ ర్యాంకు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 92 స్థానంలో, కొటాక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కొటాక్ 96 స్థానంలో ఉన్నారని బ్లూంబర్గ్ పేర్కొంది.