అమరావతి : మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, తమ మధ్య రాజకీయంగానే విభేదాలు ఉండేవని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో అక్రమ కట్టడాలపై చర్చ సందర్భంగా రోడ్లపై అక్రమంగా కొన్నివేల వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాని, ఎంపిగా ఉన్నప్పుడు కాని వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఆ విగ్రహాలను తొలగించాలని తాననడం లేదని ఆయన చెప్పారు. వైఎస్ తనకు మంచి మిత్రుడని, రాజకీయపరంగా మాత్రమే విభేదాలుండేవని ఆయన అన్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరమూ ఒకే గదిలో పడుకునేవారమని చంద్రబాబు చెప్పారు.