అసెంబ్లీ సమావేశం ప్రారంభమయిన వెంటనే మంత్రి వర్గ సమావేశం ఉందని సభను వాయిదా వేశారు.అసెంబ్లీని ప్రారంభించి వెంటనే వాయిదా వేయడం సహేతుకం కాదని సభలో విపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఏకీభవించారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయటం సహేతుకమేనని, ముందస్తు సమాచారం లేకుండా సభ వాయిదా కోరటం పట్ల స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.