విజయవాడలోని పాత సీఎం క్యాంప్ ఆఫీసును ఏపీ ప్రభుత్వం నూతన గవర్నరుకు కేటాయించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటలిజెన్స్ పోలీసులు ఈరోజు క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించి సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మరో రెండు రోజులలో గవర్నర్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండగా అప్పటికి కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.