ఈ మధ్య కల్చర్ పేరుతో కుర్రకారు మద్యానికి బానిసలై పోతున్నారు. దీనికి ఆడ, మగ అన్న తేడా కూడా లేకుండా పోయింది. తాగి నిబంధనలు ఉల్లంఘించేలా డ్రయివ్ చేస్తున్న ఓ వ్యక్తి నడుపుతున్న వాహనాన్ని ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్పై ఓ మహిళ దాడిచేసింది. ఈ ఘటన ఢిల్లీలోని మాయాపురిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. వివరాలలోకి వెళితే హెల్మెట్ లేకుండా స్కూటీ మీద వెళుతున్న ఓ మహిళ, ఓ వ్యక్తి ని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అయితే వాహనం నిలపేందుకు నిరాకరిస్తుండటంతో మద్యం తాగినట్టు గుర్తించి పోలీసు స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు నడిరోడ్డు మీద వీరంగం వేశారు. తమ స్కూటీని ఆపడమే కాకస్కూటీ తాళం తీసుకున్న ట్రాఫిక్ పోలీసును కొట్టి మరీ అతని నుంచి తాళం లాక్కున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో సమయంలో స్కూటీ మీద ఎలాంటి హెల్మెట్లేకుండా రేష్ డ్రయివింగ్లో వచ్చిన వారిని తమ సిబ్బంది ఆపారని అప్పటికే ఇద్దరూ తప్పతాగి ఉన్నారని మాయాపురి ట్రాఫిక్ ఎస్ ఐ మీడియాకు చెప్పారు, వాహనం ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించిచమే కాకుండా దాడి చేసినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.