ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్‌ను శాకాహారం జాబితాలో చేర్చాలి : శివసేన ఎంపీ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 05:56 PM

కోడిగుడ్డు మాంసాహారమే అని కొందరు, అందులో రక్తమాంసాలు ఉండవు కనక పక్కా శాకాహారమే అని కొందరు వాదిస్తుంటారు. కొందరైతే ఎగ్‌లెస్ బ్రెడ్, చాక్లెట్లు గట్రా కావాలని కూడా కోరుతుంటారు. కోడి ముందా, గుడ్డు ముందా లాంటి ఈ ఎడతెగని చర్చను శివసేన ఎంపీ పరాకాష్టకకు తీసుకెళ్లారు. గుడ్డుతోపాటు కోడి కూడా శాకాహారమేనని, వాటిని శాకాహార జాబితాలో వెయ్యాలని ఓ ఎంపీ పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేశారు. 


రాజ్యసభలో ఆయన చేసిన ఈ డిమాండ్ విని ఎంపీ నోరు వెళ్లబెట్టారు. ఆయుర్వేదంపై చర్చ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వాదన వినిపించారు. ‘చికెన్ శాకాహారమో, మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలి. నేనొకసారి నందుర్బర్ ప్రాంతంలోని గిరిజన గ్రామానికి వెళ్లాను. గిరిజను నాకు మాంసాహారం పెట్టారు. అదేంటని అడగ్గా ‘ఆయుర్వేద చికెన్’ అని చెప్పారు. అది తినడం వల్ల జబ్బులు పోతాయన్నారు. ఆయుర్వేద గుడ్లపై చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ పరిశోధన కూడా చేస్తోంది…’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. గొడ్డుమాంసాన్ని, మటన్‌ను కూడా శాకాహార జాబితాలో చేరిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com