ముంబై దాడుల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ లో జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్ నుంచి గుజ్రన్ వాలాకు వెళ్తుండగా అరెస్ట్ అయ్యాడు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలంగా పాక్ పై భారత్ ఒత్తిడి చేస్తోంది. అంతర్జాతీయంగానూ పాక్ భారత్ ఒత్తిడి తెచ్చింది. పాకిస్థాన్ ను ఫైానాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది. 2008లో జరిగిన ముంబై దాడుల్లో 164 మంది మృతిచెందారు. ముంబై దాడులకు హఫీజే సూత్రధారంటూ పాక్ కు భారత్ ఎన్నో ఆధారాలు చూపింది.