యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్కు 90 శాతం మేర నీట మునిగిందని అసోం అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 199 వేట నిరోధక కేంద్రాలకుగానూ 155 కేంద్రాలను వరద నీరు తాకిందని, భద్రతా సిబ్బంది పడవల పై తిరుగుతూ విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. మూగజీవులను కాపాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని వారు పేర్కొన్నారు. కజిరంగా నేషనల్ పార్కులో ఖడ్గ మృగాలు ఎక్కువగా ఉంటాయి.